న్యూఢిల్లీ, మే 31: దేశ వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి 200 రైళ్లు పట్టా లెక్కనున్నాయి. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. కరోనా కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొం దించాయి. అక్కడి పరిస్థితులకు అను కుణంగా ప్రయాణి కులు నిబంధనలు పాటించాల్సి ఉం టుంది. ఇప్పటికే 30 రాజధాని తరహాలో స్పెషల్ ఏసీ రైళ్లు, శ్రామిక్ రైళ్లు వలస కార్మికుల కోసం నడుస్తున్నాయి. రెండు నెలల తర్వా త ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికే మొత్తం 230 రైళ్లకు ముం దస్తు రిజర్వేషన్ వ్యవధి 30రోజుల నుంచి 120రోజు లకు పెంచింది. అయితే ప్రస్తుత బుకింగ్, తత్కాల్ కోటా రోడ్సైడ్ స్టేషన్లకు సీట్ల కేటాయింపు వంటి ఇతర నిబంధనలు రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్ల మాదిరిగానే ఉన్నాయి.
రైల్వే ప్రయాణికు లకు శుభవార్త. పట్టాలెక్కనున్న 200 రైళ్లు.